అప్సర హత్య కేసు… ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. స్నేహం పేరుతో ఆ యువతితో తిరిగిన పూజారి సాయికృష్ణ.. పెళ్లి చేసుకోవాలనే సరికి అప్సరను అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎవరికి కనిపించకుండా ఓ మ్యాన్ హోల్ లో పడేసి చేతులు దులుపుకుందాం అనుకున్నాడు. కానీ,
అసలు నిజాలు బయటకు పొక్కడంతో నిందితుడు సాయి కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఘటనపై నిందతుడు సాయి కృష్ణ భార్య శ్రావణి తాజాగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
నా భర్త హత్య చేసేంత దుర్మార్గుడు కాదంటూ నిందితుడు సాయి కృష్ణ భార్య తెలిపింది. ఇద్దరి మధ్య పరిచయం ఉన్నది వాస్తవం. కానీ, వీరి మధ్య అలాంటి రిలేషన్ షిప్ లేదని చెప్పుకొచ్చింది. అప్సర చాలా సార్లు మా ఇంటికి పూజకు కూడా వచ్చింది. గుడిలో నా భర్తకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒకరు అప్సరు అన్నారు. ఆమె గర్భవతి కావడం
అనేది నా భర్త వల్ల కాకుండొచ్చని కూడా వివరించింది. అప్సరతో నా భర్త కలిసి తిరుగుతుంటే ఆమె తల్లి ఏం చేసిందని సాయి కృష్ణ భార్య శ్రావణి ప్రశ్నించింది. మొత్తానికి నా భర్త మంచితనం వల్ల ఇదంతా జరిగిందని, పెళ్లైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకోవడం ఇంతకంటే
ముర్ఖత్వం మరొకటి లేదని ఆమె అన్నారు. అప్సర కేసులో నిందితుడు సాయి కృష్ణ భార్య శ్రావణి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Spread the love గ,పేద,ధనిక,చిన్న,పెద్ద ఎలాంటివరైన సరే బ్రతకాల్సిన మనిషి వృద్ధాప్యం చూడాల్సిందే.వృద్ధాప్యం వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉన్నా,లేకపోయినా ఓపిక,శక్తి మాత్రం తగ్గిపోతో ఉంటాయి క్రమక్రమంగా.ఇది కాగా దిర్గకలిక రోగలిఉ కానీ ఇంకా ఏదైనా […]
Spread the love చిన్న పిల్లలు అనగానే మనకు ఎంతో ముద్దు వస్తారు.వాళ్ళ చిలిపి తనం,పసితనం,అమాయకత్వం..ఇప్పుడుప్పుడే ప్రపంచం లో మొదటి అడుగులు వేస్తూ..అన్నీ ఒక్కొకటిగా నేర్చుకుంటూ ఉంటారు.. చిన్న పిల్లలకు అబంశుభమ్ తెలీదు వాళ్ళకి […]
Spread the love బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 233 మంది మృతి చెందారు. అలాగే మరో 900 మంది వరకు గాయపడ్డారు. […]