తారకరత్న భార్యకు తీవ్ర అస్వస్థత హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు ఆందోళనలో కుటుంబం

Spread the love

నందమూరి తారకరత్న (Taraka Ratna) అకాల మరణాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. భర్త దూరమయ్యాడన్న బాధలో ఉన్న తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి (Alekhya Reddy) అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా సరైన ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య రెడ్డి నీరసంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.

మరోవైపు తారకరత్నకు నివాళులర్పించేందుకు ఆయన నివాసానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలిస్తున్నారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళి అర్పిస్తున్నారు.

తారకరత్న పార్థీవ దేహాన్ని రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్‌లో ఉంచనున్నారు.

రేపు సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.