రేవతి కి మొత్తం నిజం చెప్పేసిన కృష్ణ !

Spread the love

Krishna Mukunda Murari Today: సీరియల్‌ 116 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఇక కృష్ణ తెగించింది. గౌతమ్‌కి కాల్ చేసి.. ‘గౌతమ్ సార్ మీరు నేను చెప్పినట్లు చేయండి’ అంటూ ఏదో సలహా ఇస్తుంది. ‘కృష్ణమ్మా ఇది మరీ రిస్క్ అవుతుంది కదా? ఇబ్బందులొస్తాయి’ అంటాడు గౌతమ్. ‘లేదు సార్.. అందంతా నేను చూసుకుంటాను.. మీరైతే రండి’అంటుంది కృష్ణ. సరే అంటూ ఫోన్ పెట్టేస్తాడు గౌతమ్.ఇక మరునాడు ఉదయాన్నే కృష్ణ.. వంట చేస్తున్న రేవతి దగ్గరకు వెళ్లి..‘అత్తయ్యా.. ఇంటికి ఓ అతిథిని పిలిచాను.. మీ మీద నమ్మకంతో.. వంటలు బాగా చేస్తారుగా?’ అంటుంది. ‘సరే అమ్మా.. చాలా బాగా చేస్తాను.. ఇంతకీ వచ్చేది ఎవరు?’ అంటుంది రేవతి. ‘మన నందిని ప్రేమించిన సిద్దూ అత్తయ్యా’ అంటుంది కృష్ణ, వెంటనే రేవతి చేతిలోని గరిటె జారవిడుస్తుంది షాక్‌లో. ‘ఏం చేస్తున్నావ్ కృష్ణా.. అక్కకి కోపం తెప్పించే పనులు నువ్వెందుకు చేస్తున్నావ్’ అంటూ కంగారు కంగారుగా అరుస్తుంది రేవతి చుట్టూ చూస్తూ. ‘అత్తయ్యా అసలేం జరిగిందో మీకు తెలియదు’ అంటూ నందిని గతాన్ని భవానీ పంతాన్ని మొత్తం చెబుతుంది కృష్ణ. అది మ్యూజిక్‌తో సాగుతుంది. మాటలు వినిపించవు.ఇక మరోవైపు కృష్ణ రేవతీతో.. ‘అత్తయ్యా మీకు మరో విషయం తెలుసా.. ఆ సిద్దూ ఎవరో కాదు..

మా గౌతమ్ సారే..’ అంటుంది. దాంతో మరింత షాక్ అయిపోతుంది రేవతి. ‘ఏమంటున్నావ్ కృష్ణా’ అంటుంది. దాంతో అది కూడా జరిగింది జరిగినట్లు చెబుతుంది. ‘అత్తయ్యా మనం అలానే వదిలేస్తే ఏదొకరోజు తలలో నరాలు పగిలి నందిని చనిపోతుంది అత్తయ్య’ అంటుంది కృష్ణ ఆవేదనగా. దాంతో అల్లాడిపోతుంది రేవతి. అలా జరగటానికి వీల్లేదు.. నీకు నీకు సాయంగా ఉంటాను.. అంటుంది రేవతి. అత్తయ్యా మీకేం తెలిసినట్లుగా ఉండకండి.. నేను చూసుకుంటాను అంతా. వంట ఎందుకు చేశావ్ అంటే.. కృష్ణ ఎవరో గెస్ట్ వస్తారని చెప్పింది అందుకే చేశాను అని చెప్పండి చాలు’ అంటుంది కృష్ణ. సరే అంటుంది నందిని. ఇక గౌతమ్ రెడీ అయ్యి.. తనలో తాను..

గౌతమ్ నువ్వు ఇప్పుడు గౌతమ్‌లా కాకుండా సిద్దులా వెళ్తున్నావ్.. భయపడొద్దు.. గతంలో భయపడి అజ్ఞాతంలోకి వెళ్లాను అదే తప్పు అయ్యింది. ధైర్యంగా ఉంటాను’ అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటాడు. ఇక కృష్ణ.. మురారీతో.. ‘మా గౌతమ్ సార్ వస్తున్నారు.. రెడీ అయ్యి కిందకు రండి’అంటుంది. ‘మన కాపురంలో నిప్పులు పోసిన ఆ గౌతమ్ ఇక్కడికి ఎందుకొస్తున్నాడో’ అంటుంది. ‘నందినికి టాబ్లెట్స్ ఇచ్చింది అతడే. మీ పురుషాహంకారం చూసి నాకు మండి ఇప్పటి దాకా

చెప్పలేదు’ అంటుంది. మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. రెడీ అవ్వి రండి అనేసి వెళ్లిపోతుంది కృష్ణ. ఇక మరోవైపు మధుకరణ్, అలేఖ్యలు ఊరు నుంచి ఇంటికి వచ్చేశారు. వాళ్లతో పాటు భవానీ, రేవతి, ఈశ్వర్, ప్రసాద్ అంతా ఉంగానే కృష్ణ వచ్చి.. ‘నందిని విషయంలో నా మీద నిందులు వేయడంలో ముకుంద చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఈ రోజు నిరూపించుకోబోతున్నాను’ అంటూ మాట పూర్తి కాకుండానే పై నుంచి ముకుంద, మురారీలు దిగుతూ ఉంటారు. కమింగ్ అప్‌లో గౌతమ్‌ని భవానీ వాళ్ల ముందుకు తీసుకొస్తుంది కృష్ణ. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం!