సింగర్ వాణి జయరాం మృతి విషయంలో వీడిన మిస్టరీ ఆ ఒక్క కారణం వల్లే చనిపోయిన వాణి జయరాం..ఏమైందో చూడండి

Spread the love

ప్రముఖ గాయని వాణి జయరాం ఫిబ్రవరి 4వ తేదీన చెన్నైలోని తన నివాసంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె మృతిపై మీడియాలో అనేక అనుమానాలు వ్యాపించాయి. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు..

వివిధ భాషల్లో వేలాది పాటలు ఆలపించి సంగీతాభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దిగ్గజ గాయని వాణి జయరాం (Vani Jayaram) ఈ నెల 4న చనిపోయారు. చెన్నైలోని తన ఇంట్లోనే చనిపోయిన వాణి జయరాం ముఖంపై గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో తమిళనాడు పోలీసులు అనుమానాస్పద మృతిగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసుకున్నారు. కాగా తాజగా పోస్టుమార్టం నివేదిక (Postmortem report) రావడంతో ఆమె మృతికి సంబంధించిన

మిస్టరీ (Death Mystery) వీడింది. దివంగత గాయని ఇంటి సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన మీదట ప్రమాదవశాత్తు చనిపోయినట్లు అంచనాకు వచ్చారు పోలీసులు. బెడ్ రూమ్‌లోని గ్లాస్ టేబుల్‌పై పడిపోవడంతోనే తలకు బలమైన గాయమైందని, ఇంట్లో ఎవరూ లేనందున ఆమెకు ట్రీట్మెంట్ అందక చనిపోయిందని నిర్ధారించారు.

వాణి జయరాం ఉంటున్న అపార్ట్‌మెంట్ సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు ఎటువంటి అనుమానాస్పద కదలికలు గుర్తించలేదని వెల్లడించారు. ఇంట్లోకి ఎవరూ బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్లు కూడా లేవని చెప్పారు. ఆమె మరణించే సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంది. డోర్ లోపల నుంచి లాక్ చేయబడింది. కాగా.. శనివారం వాణి జయరాం భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

నాలుగేళ్ల క్రితం భర్త జయరాం మృతి చెందినప్పటి నుంచి వాణి జయరాం చెన్నై, హడోవ్స్ రోడ్‌లోని తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఒక పని మనిషి మాత్రమే ఆమె ఇంటికి వెళ్లి అన్ని పనులను చూసుకుంటోంది. ఎప్పటిలాగే శనివారం ఉదయం 11 గంటలకు వాణీ జయరాం ఇంటికి వెళ్లిన పనిమనిషి ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా స్పందన లేకపోవడంతో ఈ విషయాన్ని ఆమె వెంటనే వాణీ జయరాం సోదరి ఉమకు తెలియజేసింది. ఆ తర్వాత డూప్లికేట్ తాళం చెవితో తలుపు తెరిచి చూస్తే అప్పటికే మరణించిన ఆమె నుదిటిపై గాయం కనిపించింది. దీంతో పోలీసులు సెక్షన్ 174 (అసహజ మరణం) కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.